
స్టాక్ మార్కెట్: ఐదు రోజుల లాభాలకు బ్రేక్
నష్టపోయిన ఐటీ షేర్లు
యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో ఐటీ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడి లోనయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రారంభం ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం ట్రేడింగ్లో 786.58 పాయింట్లు పడిపోయి 76,624.90 వద్ద ముగిసింది.
50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 210.95 పాయింట్లు క్షీణించి 23,959.80 వద్ద ముగిసింది. 30-సెన్సెక్స్ సంస్థలలో, ఇన్ఫోసిస్ 8 శాతానికి పైగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 6 శాతం, టెక్ మహీంద్రా 5 శాతం, హెచ్సీఎల్ టెక్ 4.9 శాతం నష్టపోయాయి. గత ఐదు రోజుల ర్యాలీలో లాభాలు పొందిన స్టాక్ మార్కెట్లు, తాజా పరిణామంతో నష్టపోయాయి.
హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా స్టీల్ కూడా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఎన్టిపిసి, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, పవర్ గ్రిడ్ లాభపడిన వాటిలో ఉన్నాయి. బీఎస్ఈ ఐటీ సూచీ 5.38 శాతం పడిపోయింది. "యాక్సెంచర్ గైడెన్స్ తగ్గించడం భారతీయ ఐటీ దిగ్గజాల ఏడీఆర్లలో (అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్) అమ్మకాల ఒత్తిడిని ప్రేరేపించింది" అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ అన్నారు.
ప్రపంచ చమురు బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్, 0.93 శాతం తగ్గి బ్యారెల్కు 79.11 డాలర్ల వద్ద ట్రేడయింది. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 సూచీలు స్వల్పంగా పెరిగాయి. గురువారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) గురువారం రూ. 1,025.20 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా ఐదవ సెషన్లోనూ లాభాలతో గురువారం ముగిశాయి. సెన్సెక్స్ 254.36 పాయింట్లు లేదా 0.33 శాతం పెరిగి 77,409.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82.30 పాయింట్లు లేదా 0.34 శాతం పెరిగి 24,168 వద్ద ముగిసింది.
Next Story

