తమిళనాడును కాదని ఆంధ్రకు ‘అమ్కా’ ప్రాజెక్ట్ ఎందుకు?
x
అమ్కా డీల్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

తమిళనాడును కాదని ఆంధ్రకు ‘అమ్కా’ ప్రాజెక్ట్ ఎందుకు?

వంద ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వచూపిన తమిళనాడు ప్రభుత్వం


Click the Play button to hear this message in audio format

ఐదో తరం స్టెల్త్ ఫైటర్ కార్యక్రమం కోసం భారత రక్షణ రంగ సంస్థ ప్రవేశ పెట్టిన ఆమ్కా(అమ్కా) ప్లైట్ టెస్టింగ్, ఇంటిగ్రేటేడ్ కాంప్లెక్స్ ను దక్కించుకోవడంలో తమిళనాడు వెనకబడింది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఈ సదుపాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇవ్వడంతో ఈ అవకాశం కోల్పోయింది.

శుక్రవారం పుట్టపర్తిలో రూ.15,000 కోట్ల AMCA రక్షణ కేంద్రానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉటంకించిన ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం, తమిళనాడు సాంకేతికంగా మరింత బలమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక గల కారణాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అధికారికంగా వివరించలేదు.

ఈ ప్రాజెక్టును హోసూర్‌కు తీసుకురావడానికి తమిళనాడు ప్రభుత్వం గత మూడేళ్లుగా DRDOతో చర్చలు జరుపుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రతిపాదిత హోసూర్ విమానాశ్రయంతో పాటుగా ఏఎంసీఏ ఫ్లైట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనిలో ఒకవైపు టెస్టింగ్ సదుపాయం, మరోవైపు ప్యాసింజర్ టెర్మినల్ ఉంటాయి.
హోసూర్‌లో ప్రతిపాదించిన 3.5 కిలోమీటర్ల రన్‌వేతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ సైట్‌లోని అసలు రన్‌వే సుమారు 2.1 కిలోమీటర్లు మాత్రమే ఉందని నివేదిక వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఫలితంగా, ఈ ప్రాజెక్ట్ కోసం అదనపు భూమిని సేకరించి, రన్‌వేను 3 కిలోమీటర్లకు పొడిగించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుంది.
హోసూర్ విమానాశ్రయంలో ప్రతిపాదిత 3.5 కిలోమీటర్ల రన్‌వేతో పాటు, ఈ ప్రాజెక్ట్ కోసం డీఆర్డీఓ అభ్యర్థన మేరకు తమిళనాడు కూడా 100 ఎకరాల భూమిని ఉచితంగా అందించడానికి ముందుకొచ్చింది. భారత తేలికపాటి యుద్ధ విమానాల (ఎల్‌సీఏ) రూపకల్పన, అభివృద్ధికి బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీ అయిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ప్రధాన కార్యాలయానికి సమీపంలో, బెంగళూరులోని విమానపురలో ఈ సదుపాయం ఉంది.
హోసూర్ నుంచి ADA ప్రధాన కార్యాలయం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున, ఈ సామీప్యత ఇప్పటికే ఉన్న గగనతల మౌలిక సదుపాయాలతో సులభతరమైన అనుసంధానానికి వీలు కల్పించి ఉండేదని అధికారులు తెలిపారు.
Read More
Next Story