
ఆగిపోయిన రజనీ సినిమాకు ఏఐ (AI) ప్రాణం.. 37 ఏళ్ల తర్వాత మోక్షం!
ఏం జరిగింది, ఎందుకు ఆగింది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు, వెండితెరపై కూడా అద్భుతాలు చేస్తోంది. చనిపోయిన నటులను మళ్ళీ కళ్లముందుకు తీసుకురావడం నుంచి, నటీనటుల వయసును తగ్గించడం (De-aging) వరకు ఏఐ చేస్తున్న మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే AI టెక్నాలజీ ఏకంగా 37 ఏళ్లుగా ఆగిపోయిన ఒక సినిమాకు ప్రాణం పోసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ యంగ్ లుక్ని, ఆనాటి యాక్షన్ మ్యాజిక్ని మళ్ళీ థియేటర్లలో చూడబోతున్నామంటే అది ఏఐ వల్లే సాధ్యమైంది.
నాలుగు దశాబ్దాల క్రితం ఆగిపోయిన ఒక కలని, మరుగున పడిపోయిన ఒక దృశ్య కావ్యాన్ని వెలికితీసి, నేటి తరం ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1989లో సూపర్ స్టార్ రజనీకాంత్, శతృఘ్న సిన్హా వంటి దిగ్గజాల కాంబినేషన్లో మొదలై, విధి ఆడిన వింత నాటకంలో 37 ఏళ్ల పాటు ల్యాబ్కే పరిమితమైన చిత్రం 'హం మే షహన్షా కౌన్'.
ఈ సినిమా నెగటివ్స్ పాడైపోయినా, ఆడియో క్వాలిటీ తగ్గినా.. ఏఐ టూల్స్ సాయంతో ప్రతి ఫ్రేమ్ను మలిచి, సరికొత్త మెరుపులు అద్ది ఇప్పుడు థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. టెక్నాలజీ తోడైతే కాలం కూడా వెనక్కి తగ్గుతుందని నిరూపిస్తూ, ఏఐ మ్యాజిక్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా పునరాగమనం ఇప్పుడు సినీ ప్రపంచంలో ఒక సెన్సేషన్!"
పూర్తి వివరాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అయితే, ఆయన నటించిన ఒక సినిమా ఏకంగా 37 ఏళ్ల పాటు ల్యాబ్కే పరిమితమై, ఇప్పుడు విడుదలకు సిద్ధమవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. 1989లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఏమిటా సినిమా? ఎందుకు లేట్ అయ్యింది?
రజనీకాంత్, శతృఘ్న సిన్హా, హేమమాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిందీ సినిమా పేరు ‘హం మే షహన్షా కౌన్’ (Hum Mein Shahenshah Koun).
మొదటి టైటిల్: అప్పట్లో ఈ సినిమాకు ‘తక్రావ్’ (Takrao) అనే పేరు పెట్టారు.
ఆగిపోవడానికి కారణం: షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత, నిర్మాత రాజా రాయ్ అనివార్య కారణాల వల్ల లండన్ వెళ్లిపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ తర్వాత దర్శకుడు హర్మేష్ మల్హోత్రా మరణించడం, నిర్మాత వ్యక్తిగత విషాదాలు వెరసి ఈ ప్రాజెక్ట్ గాలిలో దీపంలా మారింది.
AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో ప్రాణం పోశారు!
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటి విజువల్స్ కావడంతో, ఇప్పుడున్న క్వాలిటీకి తగ్గట్టుగా సినిమాను సిద్ధం చేయడం మేకర్స్కు పెద్ద సవాల్గా మారింది.
టెక్నాలజీ మ్యాజిక్:
ఐదేళ్ల పాటు కష్టపడి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో విజువల్స్ను స్మూత్ చేశారు. ఆడియో మాస్టరింగ్ చేసి, మిగిలిపోయిన సీన్లను ఏఐ టూల్స్తో పూర్తి చేసి సినిమాకు కొత్త కళను తీసుకొచ్చారు.
భారీ తారాగణం: అమ్రీష్ పురి, ప్రేమ్ చోప్రా వంటి లెజెండరీ నటులు కూడా ఈ సినిమాలో ఉండటం విశేషం.
నిర్మాత భావోద్వేగం..
"ఇది నా బిడ్డ లాంటిది. ఎన్నో ఏళ్ల నిశ్శబ్దం, బాధ తర్వాత ఈ సినిమాను విడుదల చేయడం నా విజయంలా భావిస్తున్నాను" అని నిర్మాత రాజా రాయ్ ఎమోషనల్ అయ్యారు. ఆ కాలం నాటి రజనీకాంత్ యాక్షన్, మేనరిజమ్స్ ఇప్పుడు వెండితెరపై మళ్ళీ చూడబోతున్నందుకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఏదైమైనా ...
రజనీకాంత్ స్టైల్, ఓల్డ్ వరల్డ్ చార్మ్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక విందు లాంటిది. 37 ఏళ్ల తర్వాత ఓ సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక రికార్డు అనే చెప్పాలి. మరి ఈ 'షహన్షా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి!


