
కే. భాగ్యరాజ్
గురువును అనుసరించిన శిష్యుడు
వెటరన్ తమిళ్ ఫిల్మ్ మేకర్ కే. భాగ్యరాజ్ కన్నూమూత, గురువు భారతీ రాజా చనిపోయిన రెండు వారాలకే మరణం
ప్రముఖ చిత్రనిర్మాత, నటుడు, స్క్రీన్ రైటర్ కె. భాగ్యరాజ్ శనివారం (జూన్ 27) గుండెపోటుతో 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భాగ్యరాజ్ ఇటీవలి వరకు ప్రజా జీవితంలో చురుకుగా ఉన్నారు. కొద్ది రోజుల ముందు, గోవాలో నటి-రాజకీయవేత్త ఖుష్బూ సుందర్ కుమార్తె వివాహానికి హాజరయ్యారని ‘ఇండియా టుడే’ నివేదించింది.
సినీ జీవితం..
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భాగ్యరాజ్ జన్మించారు. ఆయన మొదటి పేరు కృష్ణ స్వామి. తరువాత సినీ రంగంలో భాగ్యరాజ్ గా పేరు మార్చుకున్నారు. ప్రఖ్యాత చిత్రనిర్మాత భారతిరాజా వద్ద సహాయకుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.
ఆ తర్వాత ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా సంగీత స్వరకర్తగా రాణించి, తమిళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన సృజనాత్మక శక్తులలో ఒకరిగా ఎదిగారు. భారతిరాజా దర్శకత్వం వహించిన 'పుతియ వార్పుగళ్' చిత్రంలో కథానాయకుడిగా పరిచయమైన ఆయన, తనదైన ప్రత్యేక కథన శైలితో చిత్రనిర్మాతగా స్థిరపడ్డారు.
తన వినూత్నమైన స్క్రీన్ప్లే పద్ధతులు, సినిమా నిర్మాణంలో సహజవాద విధానానికి ప్రసిద్ధి చెందిన భాగ్యరాజ్, భారతీయ సినిమాలోని అత్యుత్తమ స్క్రీన్ రైటర్లలో ఒకరిగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన చిత్రాలు, వాటిలో చాలా వరకు కుటుంబ, మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ శాశ్వతమైన ప్రజాదరణను పొందుతూ, తరతరాల సినీ ప్రేక్షకులకు ఇష్టమైనవిగా నిలిచి ఉన్నాయి.
చివరి సంవత్సరాలు..
ఆయన చివరి దర్శకత్వ చిత్రం 'సిత్తు ప్లస్ టూ', ఇది 2012లో విడుదలైంది. ఇందులో ఆయన కుమారుడు శాంతను భాగ్యరాజ్ నటించారు. ఆ తర్వాతి సంవత్సరాలలో, ఆయన ఎక్కువగా నటనపై దృష్టి సారించారు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి పలువురు ప్రముఖ తమిళ నటులతో కలిసి తెరను పంచుకున్నారు.
తన గురువు భారతిరాజా జూన్ 10న మరణించిన కేవలం 17 రోజులకే భాగ్యరాజ్ మరణించారు. ఇంత తక్కువ వ్యవధిలో గురువును, ఆయన ప్రఖ్యాత శిష్యుడిని కోల్పోవడం తమిళ చిత్ర పరిశ్రమపై విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story

