
గురజాడ అప్పారావు స్మారక నాటిక రచనల పోటీ
రచయితలకు పిలుపు
గురజాడ ఫౌండేషన్ (అమెరికా-భారత్) వారు ఈ ఏడాదికి ‘మహాకవి శ్రీ గురజాడ అప్పారావు స్మారక నాటికరచనల పోటీ-2025’ నిర్వహిస్తున్నారు. ప్రదర్శనకు అనుకూలమయిన రచనలను పోటీకి పంపాలని వారు ఒక ప్రకటనలో రచయితలకు విజ్ఞప్తి చేశారు. మొదటి బహుమతి కింద రు.10 వేలు అందచేస్తారు. రెండవ బహుమతిగా రు. 8000, మూడవ బహుమతిగా రు. 5000 అందిస్తారు. ఈ పోటీలను విజయవాడ ‘దృశ్యవేదిక’ సహకారంతో నిర్వహిస్తున్నారు. వారు రచయితలకు చేసిన సూచనలు ఇక్కడ అందిస్తున్నాము.
రచనలను పంపేందుకు అక్టోబర్ 2, 2025 చివరి తేది. పోటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే హేమాద్రి ప్రసాద్ (Whatsapp No. 7893274383), డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ ([email protected])లను సంప్రదించవచ్చు.
Next Story


