LIVE తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ
x

తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ

జననాయకుడిగా మారిన విజయ్


Click the Play button to hear this message in audio format

దేశంలో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.

విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..

దేశంలో అత్యంత కీలకమైన తమిళనాడు ఎన్నికలలో తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తుందా? మెజారిటీ ఎంత సాధిస్తారు? విజయ్ కింగ్ మేకర్ అవుతాడా? హంగ్ వస్తుందా? ఇవే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి.
సంక్షేమ పథకాలు, ద్రవిడవాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని స్టాలిన్ నమ్ముతున్నారు. అయితే పార్టీ ఎప్పుడూ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే వైపే నిలిచాయి.
సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీగా ఓట్లు చీలుస్తుందని అంచనాలు ఉన్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒంటరిగా బరిలోకి దిగింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే 30 శాతం ఓట్లు, 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది మొత్తం ఎన్నికల కథనాన్ని తలకిందులు చేసింది. ఇదే నిజమైతే భారత ఎన్నికల చరిత్రలో ఇదో సంచలనం అవుతుంది.

పుదుచ్చేరిలో..

30 స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బలంగా ఉండటంతో పోరు హోరాహోరీగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న అంశాలు కూడా వేగంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

కేరళ..

కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండుసార్లు పీఠంపై ఉన్నారు. ఇప్పడు ఆయన హ్యట్రిక్ విజయంపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 99 స్థానాలు సాధించి అధికారం చేపట్టారు. కానీ తరువాత అన్ని ప్రతికూల అంశాలు ఎల్డీఎఫ్ ను చుట్టుముట్టాయి. అవినీతి,కుంభకోణాలు వెలుగుచూడటంతో యూడీఎఫ్ బలం ఫుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ వామపక్షాలు ఓటమి పాలైతే దేశంలో ఉన్న చివరి అధికారకోట కూడా కోల్పోయినట్లు అవుతుంది.

పశ్చిమ బెంగాల్ లో..

ఉత్తరాదిన ఉన్న పశ్చిమ బెంగాల్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 148. ఇక్కడ 2011 నుంచి టీఎంసీ అధికారంలో ఉంది. గత 15 ఏళ్లు పాలనలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. దీనితో బీజేపీ బలంగా పోరాడింది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని మమతా బెనర్జీ వైపు, ఇంకొన్ని బీజేపీ వైపు నిలిచాయి. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మరో పెద్ద రాష్ట్రం దాని సొంతమవుతుంది.
ఈసారి బెంగాల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి ఘర్షణలు, కర్ప్యూలు లేవు. పార్టీ కార్యాలయాలకు నిప్పులు పెట్టడం లాంటివి జరగలేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ వల్ల 27 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీనిపై టీఎంసీ వీధి పోరాటాలతో పాటు న్యాయ స్థానాలను ఆశ్రయించింది.

అస్సాం..

అస్సాంలో 126 స్థానాలు ఉన్నాయి. బీజేపీ మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగింది. ఇక్కడ మరోసారి ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదే జరిగితే వరుసగా మూడో సారి బీజేపీ అధికారం దక్కించుకున్నట్లు అవుతుంది.


Live Updates

  • 4 May 2026 9:09 AM IST


    పోస్టల్ ఓట్లు :

    కేరళలో పోరు హోరాహోరీ
    ఎల్డీఎఫ్- 65:
    యూడీఎఫ్ - 65 ;
    ఎన్డీఏ - 4
    బెంగాల్ ఢీ అంటే ఢీ అంటున్న టీఎంసీ, బీజేపీ
    టీఎంసీ -58
    బీజేపీ- 67
    కాంగ్రెస్ 2
    అస్సాంలో..
    బీజేపీ-40
    కాంగ్రెస్- 14
    ఏఐయూడీఎఫ్- 1
    తమిళనాడు
    డీఎంకే-41
    అన్నాడీఎంకే- 22
    టీవీకే- 10
    పుదుచ్చేరి
    ఎన్డీఏ -6
    టీవీకే -4


  • 4 May 2026 8:09 AM IST

    మహబలిపురంలో రిసార్ట్ లు బుక్ చేసిన టీవీకే

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నేడు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తరువాత ఈవీఎం లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కొత్తగా పోటీకి దిగిన టీవీకే పార్టీ రిసార్ట్ లు బుక్ చేసింది. పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులను వెంటనే మహాబలిపురం రిసార్ట్ కు తరలించేలా ఏర్పాట్లు చేసింది.

  • 4 May 2026 7:49 AM IST

    ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న కేరళలో ఎన్నికల అధికారులు ఉదయం స్ట్రాంగ్ రూమ్ లను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తామని అధికారులు వెల్లడించారు.

    మరోవైపు పశ్చిమ బెంగాల్ లో స్ట్రాంగ్ రూముల వద్ద బీజేపీ, టీఎంసీ ఏజెంట్లు గొడవకు దిగారు. దీనితో భద్రతా దళాలు అప్రమత్తమై ప్రశాంతమైన వాతావరణం ఏర్పరిచాయి.

Read More
Next Story