
‘‘భారత్ పై ఐరాస నివేదిక రాజకీయ ప్రేరేపితమైనవి’’
తీవ్రంగా ఖండిాంచిన విదేశాంగ శాఖ
భారత్ పై ఐరాస జాతి వివక్ష నిర్మూలన కమిటీ చేసిన పరిశీలనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టివేసింది. ఇవి దురుద్దేశపూరితమైనవని ఖండించింది. ఐసిఇఆర్డి (ICERD) కింద భారత్ 11వ ఆవర్తన సమీక్ష అనంతరం జాతి వివక్ష నిర్మూలన కమిటీ చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం (ఆగస్టు 26) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రక్రియను ఒక సాధారణ ఒప్పంద సంస్థ సమీక్షగా అభివర్ణిస్తూ, నిర్మాణాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో భారత్ ఈ సమీక్షలో పాల్గొందని, జాతి వివక్షను అరికట్టడానికి న్యూఢిల్లీ కట్టుబడి ఉందని MEA పేర్కొంది. సమీక్ష ప్రక్రియలో, భారత్ రాజ్యాంగ రక్షణలు, సమగ్ర చట్టపరమైన చట్రం, బహుళత్వ స్ఫూర్తి, అణగారిన వర్గాల పరిరక్షణకు నిరంతర ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించిందని కూడా అది తెలిపింది.
రాజకీయ ప్రేరేపితం..
"మేము కమిటీ పరిశీలనలకు నిర్దేశిత ప్రక్రియ ద్వారా స్పందిస్తాము. అయితే భారత సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా నేతృత్వంలోని అంతర్-మంత్రివర్గ ప్రతినిధి బృందం, సమీక్షా సమావేశంలో విస్తృతమైన సాధారణీకరణలు, నిరాధారమైన ఆరోపణలు లేదా కన్వెన్షన్ ఆదేశాలను అతిక్రమించే ధోరణిని ఇప్పటికే తిరస్కరించింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
"నివేదికలోని రాజకీయ ప్రేరేపిత, అత్యంత దురుద్దేశపూర్వకమైన ఏవైనా ప్రస్తావనలను భారత్ తీవ్రంగా ఖండిస్తుంది" అని అది జోడించింది.
ఐరాస ఆందోళన..
చట్టాన్ని అమలు చేసే సిబ్బంది, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, దళితులు, పౌరసత్వం లేనివారితో సహా జాతి, మత స్వదేశీ వర్గాలకు సంబంధించిన "భారీ ఉల్లంఘనలు" జరిగాయని ఆరోపిస్తూ, జాతి వివక్ష నిర్మూలనపై ఐక్యరాజ్యసమితి కమిటీ (CERD) వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విధంగా స్పందించింది.
అన్ని రకాల జాతి వివక్ష నిర్మూలనపై కన్వెన్షన్ను దేశాలు ఎలా అమలు చేస్తున్నాయో సమీక్షించే స్వతంత్ర సంస్థే ICERD. ఆగస్టు 11-12 తేదీలలో జరిగిన భారత్ పై దాని తాజా సమీక్ష, 2023లో దేశం సమర్పించిన సంయుక్త ఆవర్తన నివేదికలను పరిశీలించింది.
జెనీవాలోని భారత శాశ్వత మిషన్ ప్రకారం, ఈ చర్చలు ICERD కింద భారతదేశ పరిపాలనా ఏర్పాట్లు, అణగారిన వర్గాల పరిస్థితి, పక్షపాతం, అసహనాన్ని పరిష్కరించే చర్యలను పరిశీలించాయి. 1960లలో ICERD ముసాయిదా రూపొందించినప్పటి నుంచి భారత్ దానితో ప్రయాణిస్తోంది.
Next Story

