పవన్ ఖేరాకు ఎదురుదెబ్బ.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
x
పవన్ ఖేరా

పవన్ ఖేరాకు ఎదురుదెబ్బ.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

అస్సాం ముఖ్యమంత్రి భార్యపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ నాయకుడు


Click the Play button to hear this message in audio format

అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ భార్యపై ఆరోపణలు చేసినందుకుగానూ నమోదైన కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు వారం రోజుల ముందస్తు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ అస్సాం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్పందన కోరుతూ, జస్టిస్ జేకే మహేశ్వరి, ఎ ఎస్ చందుర్కర్ లతో కూడిన ధర్మాసనం, ప్రతివాదులకు నోటీస్ జారీ చేసింది.

కోర్టు చెప్పినది..

అస్సాం ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అస్సాంలో నమోదైన కేసులో ఖేరా బెయిల్ కోసం తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేయడమే అని పేర్కొంది.
పిటిషన్ పై నోటీస్ జారీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వుల అమలు నిలిపివేయబడుతుందని ధర్మాసనం పేర్కొంది. మూడు వారాల తరువాత ఈ విషయాన్ని విచారణకు వాయిదా వేసింది. ఏప్రిల్ 10న హైకోర్టు ఖేరాకు కొన్ని షరతులతో ఒక వారం ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసి, సంబంధిత కోర్టులో దరఖాస్తు దాఖలు చేయడానికి వారం గడువు ఇచ్చింది.

ఖేరా ఆరోపణలు..

ఏప్రిల్ 5న జరిగిన ఒక పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. అస్సాం ముఖ్యమంత్రి భార్య రినిక భూయాన్ శర్మకు పలు పాస్ పోర్టులు, విదేశీ ఆస్తులు ఉన్నాయని, అయితే ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వీటిని ప్రకటించలేదని ఆరోపించారు. శర్మ వీటిని అసత్యమైనవి, కల్పితమైనవిగా కొట్టిపారేశారు.
ఖేరాపై గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ లో బీఎన్ఎస్ 175(ఎన్నికకు సంబంధించి తప్పుడూ ప్రకటన), 35 (శరీరం, ఆస్తి స్వీయ రక్షణ హక్కు),318(మోసం) సహ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read More
Next Story