భారత సైన్యం- చైనా పీఎల్ఏ మధ్య తోపులాటలు
x

భారత సైన్యం- చైనా పీఎల్ఏ మధ్య తోపులాటలు

అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పన్ సిరి జిల్లాలో ఘటన


Click the Play button to hear this message in audio format

భారత్- చైనా మధ్య మరోసారి ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా అరుణాచల్ ప్రదేశ్ పై వితంత వాదనలు చేస్తున్న చైనా, తాజాగా అప్పనసిరి జిల్లాలోని ఉన్న భారత సైన్యంతో ఘర్షణకు దిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌తో పాటు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘర్షణకు సంబంధించిన చిత్రాలు, వీడియోలపై జూలై 26 తేదీ ఉన్నప్పటికీ, ఈ రెండు బలగాల మధ్య ఘర్షణ జూలై 25న ప్రారంభమై ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు పేర్కొన్నాయి.

తాజాగా వెలుగులోకి..

అసఫిలాకు సమీపంలోని తక్సింగ్, మాజా, గలేము, పోట్రాంగ్ సరస్సు, తామా చుచు, గాలెన్ సిన్యిక్, శ్రీచు లోయ ప్రాంతాల వద్ద చైనా వైపు నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై వివాదం చెలరేగిన సమయంలో ఈ నివేదికలు వెలువడ్డాయి. ముఖ్యంగా, ఈ ప్రాంతాలు పీఎల్‌ఏ నియంత్రణలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ విషయాన్ని మొదటగా 'నాహ్ వెల్ఫేర్ సొసైటీ' అనే స్థానిక గిరిజన సంస్థ వెలుగులోకి తెచ్చింది. స్థానికులు సాంప్రదాయకంగా పశువుల మేత, అటవీ ఉత్పత్తుల కోసం ఉపయోగించే భూముల్లో చైనా రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మించిందని ఆరోపణలు వచ్చాయి.

ఆక్రమణ ఆరోపణలు

చైనా కొత్తగా ఆక్రమణలకు పాల్పడిందన్న ఆరోపణలను భారత సైన్యం, అరుణాచల్ ప్రదేశ్ హోం మంత్రి మామా నటుంగ్ ఖండించింది. వాటిని పుకార్లుగా పేర్కొన్నారు. అంతకుముందు, పీఎల్‌ఏ 60 కిలోమీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చిందని పేర్కొన్న కొన్ని వైరల్ వీడియోలు సంబంధం లేనివని, పాతవే మళ్ళీ ప్రచురించిన ఫుటేజ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గుర్తించింది.

కొత్త దృశ్యాలు..

కానీ ఇప్పుడు, కొత్తగా వెలుగులోకి వచ్చిన ఫోటోలు, వీడియోలు అవి అబద్దాలని తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉండగా, కామ్లే జిల్లాకు చెందిన స్థానిక నాయకుడు అజయ్ మూర్టెం, ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో, ప్రభావిత ప్రాంతాలుగా ఆరోపించబడిన వాటిపై క్షేత్రస్థాయి అంచనా వేయాలని, అలాగే వాస్తవాలను నిర్ధారించుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సైన్యం, ఐటీబీపీతో సమన్వయం చేసుకోవాలని, ఆరోపించబడిన తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఒక అధికారిక ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

ధృవీకరణకు చేయాలి..

ఆ లేఖలో, సరిహద్దు వద్ద నిఘాను పెంచాలని, స్థానికులలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని కూడా మూర్టెం విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ ప్రతులను రాష్ట్ర, కేంద్ర హోం మంత్రులకు పంపినట్లు సమాచారం.


Read More
Next Story