
నేపాల్ మెరుపు వరదల్లో చిక్కుకున్న మలయాళీలు
37 మంది ఉన్నట్లు వెల్లడి, అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం, స్పందించిన కేరళం ప్రభుత్వం
నేపాల్ లో సంభవించిన మెరుపు వరదల వల్ల కేరళంకు చెందిన 37 మంది చిక్కుకున్నారని తేలింది. ఈ విషయం పై ఎమ్మెల్యే కున్హి కృష్ణ మాట్లాడుతూ.. తన నియోజక వర్గమైన పయ్యానూర్ కు చెందిన వ్యక్తులు నేపాల్ పర్యటనకు వెళ్లారని, అకస్మాత్తుగా సంభవించిన వరదలో చిక్కుపోయారని వెల్లడించారు.
తాను ఈ విషయాన్ని సీఎం సతీషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పర్యాటకులు ప్రయాణం కొనసాగించడానికి అనువైన పరిస్థితులు అక్కడ లేవని తక్షణమే సాయం అందించాలని కోరినట్లు వెల్లడించారు.
పర్యాటకుల ప్రస్తుత ఆచూకీ, ఫోన్ నంబర్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేశానని కున్హికృష్ణన్ పేర్కొన్నారు. వారందరినీ వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎంఓ హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఈ సమాచారాన్ని పర్యాటకుల కుటుంబ సభ్యులకు తెలియజేశామని, 37 మంది క్షేమంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. "పర్యటనకు వెళ్లిన వారందరితో మేము మాట్లాడగలిగాము," అని ఆయన చెప్పారు.
వరదల నేపథ్యంలో, నేపాల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను తిరిగి తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం బుధవారం రాత్రి తక్షణ చర్యలు చేపట్టింది. పర్యాటకుల భద్రతను, వారిని వేగంగా తరలించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సతీసన్ కేరళ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులు, వారి బంధువులు సంబంధిత అధికారులను సంప్రదించేందుకు కేరళం ప్రభుత్వం 9447111844, 9747132147 హెల్ప్లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది.
Next Story

