రాజీనామా వార్తలు అంతా అబద్దం: కర్ణాటక మంత్రి
x

రాజీనామా వార్తలు అంతా అబద్దం: కర్ణాటక మంత్రి

వాల్మీకీ కార్పొరేషన్ కుంభకోణంలో మంత్రి ప్రమేయం ఉందని ప్రతిపక్షాల ఆరోపణలు


Click the Play button to hear this message in audio format

కర్ణాటకలోని వాల్మీకీ కార్పోరేషన్ లో రూ.89 కోట్ల అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను మంత్రి బీ. నాగేంద్ర ఖండించారు. ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి అయిన నాగేంద్ర, ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారన్న ఊహాగానాలు జోరుగా సాగాయి.

పార్టీ నాయకత్వాన్ని ఇకపై ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని, అందుకే బుధవారం సాయంత్రంలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనుకుంటున్నానని నాగేంద్ర శివకుమార్‌తో చెప్పినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు.

"ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. నాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు, రాజీనామాకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు" అని నాగేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

కుంభకోణం..

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణలపై నాగేంద్రను క్యాబినెట్ నుంచి తొలగించాలని ప్రతిపక్ష బీజేపీ, దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్) డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు విధానసౌధ లోపల, వెలుపల నినాదాలు, నిరసనలతో కర్ణాటక శాసనసభ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాయి.
దీంతో నిర్ణీత గడువు ముగియడానికి మూడు రోజుల ముందే, ఆగస్టు 24న సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ పి. మే 2024లో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కార్పొరేషన్ కేసు వెలుగులోకి వచ్చింది.
నిధుల అనధికార బదిలీ జరిగిందని ఆరోపిస్తూ ఆయన ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టారు. తదనంతరం జరిగిన దర్యాప్తులో, కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల నుంచి వివిధ ఖాతాలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అయినట్లు ఆరోపణలు రావడంతో, ఇది రాజకీయ వివాదానికి దారితీసి, నాగేంద్ర రాజీనామాకు డిమాండ్లు వెల్లువెత్తాయి.
అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నాగేంద్ర, వివాదం నేపథ్యంలో 2024 జూన్‌లో రాజీనామా చేయగా ఆ తర్వాత 2026 ఆగస్టు 3న తిరిగి క్యాబినెట్‌లోకి చేరారు.
Read More
Next Story