
ఎన్నికల రాజకీయాల నుంచి సిద్ధరామయ్య రిటైర్ మెంట్
వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటన
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. కేఆర్ పేటలో దివంగత కేఆర్ పేట కృష్ణ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ, తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రకటనపై ఆయన ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, మద్దతుదారులు "కనీసం మరో 10 ఏళ్ల పాటు ఎన్నికల రాజకీయాల్లో చురుకుగా ఉండండి" అని ఆయనకు విజ్ఞప్తి చేశారు. వారి సందేశాలకు స్పందించిన ఆయన తన రాజకీయ రిటైర్ మెంట్ పై స్పష్టమైన ప్రకటన చేశారు. "నేను 2028 ఎన్నికల్లో పోటీ చేయను" అని తెలిపారు.
ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರ ಇಂದು ಕಲುಷಿತಗೊಂಡಿರುವುದರಿಂದ 2028ರ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ನಾನು ಸ್ಪರ್ಧಿಸುವುದಿಲ್ಲ. ಆದರೆ, ಸಕ್ರಿಯ ರಾಜಕಾರಣದಲ್ಲಿದ್ದು, ಜನರ ಕಷ್ಟ, ಸುಖಗಳಿಗೆ ಧ್ವನಿಯಾಗಿ ನಿಲ್ಲುತ್ತೇನೆ.
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2026
ಮತ್ತೊಮ್ಮೆ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧಿಸುವಂತೆ ವರುಣ ಕ್ಷೇತ್ರದ ಜನರು ಒತ್ತಾಯಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ನಾನು ಇನ್ನು ಮುಂದೆ ಯಾವುದೇ… pic.twitter.com/v0S4tCQ30o

