నీట్ రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
x

నీట్ రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం


Click the Play button to hear this message in audio format

కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య విద్య అర్హత పరీక్ష నీట్ ను రద్దు చేయాలని, పాత విధానంలో జరిగినట్లు అంటే 12 వ తరగతి మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని తమిళనాడు డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం విజయ్ నేతృత్వంలోని అసెంబ్లీ ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌రాజ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో, వైద్య విద్య విషయంలో నీట్ సామాజిక న్యాయానికి, సమానత్వానికి, అలాగే రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం నొక్కి చెబుతోందని పేర్కొంది.

నీట్ తమిళ మాధ్యమ విద్యార్థులు, గ్రామీణ, సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల వైద్య విద్య అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని తీర్మానం ఆరోపించింది. డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే, వామపక్ష పార్టీల సభ్యులు ఈ తీర్మానానికి మద్దతుగా మాట్లాడిన తర్వాత, దానిని ఆమోదించారు.
బీజేపీ ఎమ్మెల్యే భోజరాజన్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేశారు. ఒక డీఎంకే ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, మంత్రి రాజ్‌మోహన్ ఈ విషయంలో "రాజకీయాలకు దూరంగా ఉండాలి" అని అన్నారు. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆ డీఎంకే శాసనసభ్యుడి కొన్ని వ్యాఖ్యలను తొలగించారు.


Read More
Next Story