
‘మేకెదాటు’ ప్రాజెక్ట్ పై విజయ్ అత్యవసర సమీక్షా సమావేశం
కావేరి నదీపై కర్ణాటక నిర్మించబోతున్న కొత్త ప్రాజెక్ట్ పై తమిళనాాడులో తీవ్ర అభ్యంతరాలు
కావేరి నదీపై కర్ణాటక నూతనంగా ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్ట్ విషయంపై సీఎం విజయ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ను తమిళనాడు ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే వీరి అభ్యంతరాలను పట్టించుకోకుండా కావేరీ నదిపై ప్రాజెక్ట్ నిర్మించే ప్రదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూమి పూజ నిర్వహించింది. ఈ నేపథ్యంలో సీఎం హుటాహుటిన సమీక్షా సమావేశం నిర్వహించారు. "తమిళనాడు హక్కులను నిర్ధారించడానికి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ సవివరమైన సమీక్షా సమావేశం జరిగింది" అని ప్రభుత్వం పేర్కొంది.
చట్టపరమైన అంశాలపై..
సుప్రీంకోర్టు చట్టపరమైన పరిధిపై కేంద్ర నిపుణులు మాత్రమే నిర్ణయించగలరని గతంలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తమిళనాడు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ చర్చ జరిగిందని ఆ ప్రకటన తెలిపింది. "పైన పేర్కొన్న కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని, సవివరమైన సంప్రదింపుల అనంతరం చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు," అని ఆ ప్రకటనలో వెల్లడించారు.
మేకేదాటు వివాదం
తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి అనే రెండు లక్ష్యాలను నెరవేర్చడానికి కర్ణాటక, కావేరీ నదిపై మేకేదాటు వద్ద ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నిర్మించాలని యోచిస్తోంది. దిగువన ఉన్న రాష్ట్రమైన తమిళనాడు, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే తమపై ప్రభావం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సమావేశంలో క్యాబినెట్ మంత్రులు ఎన్. ఆనంద్, అధవ అర్జున, ఆర్. నిర్మల్కుమార్లతో పాటు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ పాల్గొన్నారు.
Next Story

