
'ఇసకపట్నం' ఎలా ఉంది?
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. ప్రముఖ ఎడిటర్, దర్శకుడు గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్, విడుదలైంది మొదలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పొలిటికల్ క్రైమ్ డ్రామా, 1980 మరియు 1990ల నాటి తీరప్రాంతం బ్యాక్డ్రాప్లో సాగుతుంది.
ఈ సీరీస్ ఎలా ఉంది ?ప్రేక్షకులను మెప్పించిందా ?లేదా ?
దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎంచుకున్న 1990ల నాటి పోర్ట్ బ్యాక్డ్రాప్, పొలిటికల్ క్రైమ్ డ్రామా లైన్ బాగుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ వైరాన్ని క్రైమ్ ఎలిమెంట్స్కు జోడించి దర్శకుడు కథను ఆసక్తికరంగానే రాసుకున్నాడు. ప్రశాంత్ రగతి అందించిన కథ, సయ్యద్ తాజుద్దీన్ రాసిన డైలాగ్స్ సన్నివేశాలకు బలాన్ని ఇచ్చాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ ఆనాటి కాలీ కాలాన్ని, తీరప్రాంత వాతావరణాన్ని స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్ను బాగా ఎలివేట్ చేసింది.

