
ప్రొఫెసర్ అశోక్ గులాటీ
దేశ సబ్సిడీ మోడల్ పర్యావరణానికి హానికరంగా ఉందా?
56 శాతం జనాభాకి ఉచిత ఆహారం అందించడం కాదు, అంతమంది ఆహారం కొనలేకపోతున్నారా?
భారత ప్రభుత్వం అందిస్తున్న అతిపెద్ద సబ్సిడీలు- ఆహారం, ఎరువుల విషయంలో ఎందుకు పునరాలోచన చేయాలని దానిపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్(ICREIR) ప్రొఫెసర్ అశోక్ గులాటీ ఫెడరల్ తో మాట్లాడారు.
ప్రస్తుత నమూనా ఆర్థికంగా భారీగా ఉందని, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని రాజకీయంగా సంస్కరణలు చేయడం కష్టమని చెప్పారు. పొదుపులు, నైపుణ్యాలను గ్రామీణ మౌలిక సదుపాయాలకు మళ్లించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని చెప్పారు.
ఆహరం, ఎరువుల సబ్సిడీలు బడ్జెట్ లో ఎక్కువ భాగాన్ని భాగాన్ని ఆక్రమిస్తాయి? ఈ భారాన్ని మీరు చూస్తారు?
కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయరంగాన్ని వివరంగా పరిశీలిస్తే సబ్సిడీలు అర్థం అవుతాయి. రాష్ట్ర బడ్జెట్ లలో కూడా సబ్సిడీలు కనిపిస్తున్నాయి. వీటిలో ముందుగా విద్యుత్ సబ్సిడీలు ఉంటాయి.
యూనియన్ బడ్జెట్ ను చూస్తే..ఈ సంవత్సరం ఆహార సబ్సిడీ దాదాపు రూ.2.25 లక్షల కోట్లు, ఎరువుల సబ్సిడీ రూ. 1.95 లక్షల కోట్లు నుంచి 2 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇవి మొత్తం కలిసి రూ. 4.25 లక్షల కోట్లుగా ఉంటాయి. మన బడ్జెట్ మొత్తం విలువ రూ. 51 లక్షల కోట్లు బడ్జెట్. ఇందులో సబ్సిడీల విలువవ 8 నుంచి 8.5 శాతానికి సమానం.
మీరు ఆహార సబ్సిడీని వ్యతిరేకిస్తున్నారా? విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా?
ఆహర సబ్సిడీ కేవలం వినియోగదారులకే. అత్యంత పేదరికంలో ఉన్నవారికి జీవనోపాధి కోసం సంపాదించుకోలేని వారికి మీరు ఉచితంగా ఆహారం ఇస్తున్నప్పుడు నాకు ఎటువంటి సమస్య లేదు. మీరే వారిని రక్షించాల్సిన బాధ్యత కూడా.
ప్రపంచ బ్యాంకు ప్రకారం రోజుకు తలసరి ఆదాయంలో 3 డాలర్ల కంటే కంటే తక్కువ సంపాదిస్తే వారు తీవ్రమైన పేదరికమని అర్థం. ఈ లెక్క ప్రకారం దేశంలో కేవలం 5.3 శాతం మాత్రమే పేదరికం కంటే దిగువన ఉన్నారు. అధిక పేదరికం నిర్వచనం తీసుకున్న 2.2 డాలర్లను తీసుకుంటే 24 శాతం ఉంటారు.
వాజ్ పేయ్ కాలంలో అంత్యోదయ అంటే అత్యంత పేదవారికి ఉచిత ఆహారం అందించాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు బీపీఎల్ కనీస మద్దతు ధరలో కనీసం సగం చెల్లించాలి. అంతకంటే ఎక్కువ ఉన్నవారు కనీస మద్దతుధరలో 90 శాతం చెల్లించాలి.
ఇది చాలామంచిది. ఎందుకుంటే మనం 56 శాతం మందికి ఉచిత ఆహరం ఇస్తున్నారు. లేదా భారత్ లో 56 శాతం ఆహారం కొనడానికి సిద్ధంగా లేరని వారికి ఉచిత ఆహారం ఇవ్వాలనుకుంటున్నారని అంటున్నారు.
దీనిని 56 శాతం నుంచి క్రమంగా 40 శాతం, 25 శాతం, 15 శాతానికి తగ్గించి ఆదా చేసిన డబ్బును ప్రజల నైపుణ్యాలను పెంచడానికి ఉపయోగించాలి. ప్రతిరోజు వ్యక్తికి చేపలు ఇవ్వడం బదులు.. చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తే మంచిది.
ఉచిత సేవలన్నీ కూడా రాజకీయంగా, ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. చిన్న చీమ కూడా తన ఆహార భద్రత కోసం కష్టపడి చేస్తోంది. మరీ మనం మనుషులం. కాబట్టి ఆహార సబ్సిడీని హేతుబద్దీకరించాలి.
56 శాతం ఉచిత రేషన్ మంచిది కాదని, కానీ రాజకీయంగా ఏ ప్రభుత్వమైన చేయగలదా?
ఇది ఆర్థికపరమైన వాటి కంటే రాజకీయమైనది. ఆర్థికంగా 56 శాతం మందికి ఉచిత ఆహారం ఇవ్వకూడదని అందరూ అంగీకరిస్తారు. రాజకీయంగా దానిని తగ్గించడానికి ప్రయత్నించే ఏ పార్టీ అయిన కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షం వెంటనే వారిని పేదల వ్యతిరేక పార్టీలుగా ముద్రవేసి ప్రచారం చేస్తుంది. ఇది వ్యాపారవేత్తలకు వెళ్తుందని చెబుతారు.
అద్భుతమైన బైక్ లు, కార్లు ఉన్నవారు కూడా ఉచిత ఆహరం తీసుకుంటున్నారని నాకు తెలుసు. వారు స్మార్ట్ ఫోన్ లు, బైక్ లు కొంటే ఎందుకు ఉచిత ఆహారం ఇవ్వాలి.
దుర్వినియోగం కలిగితే సబ్సిడీలను పూర్తిగా తొలగించాల్సిందేనా?
పేదలలో అత్యంత పేదవాడు అంత్యోదయ పథకం అందించాలి. ప్రపంచ బ్యాంకు వారికి 5.3 శాతం, పేదరిక అంచనాల ప్రకారం 11 శాతం లేదా 15 శాతం ఆహారం అందించాలి.
కానీ 56 శాతానికి అందించడం అనేది మంచిదికాదు. ఎంఎస్ఎస్పీ లేదా ఎఫ్సీఐ ఆర్థిక వ్యయంలో సగం వసూలు చేయాలి. ఇది పేదలకు వ్యతిరేకం కాదు. సబ్సిడీ హేతుబద్దీకరణ.
మీరు ఖర్చు, మార్కెట్ ధర వాదనను కూడా లేవనెత్తారు? ప్రస్తుత డిజైన్ లో అహేతుకం ఏంటీ?
ఒక ఉదాహారణతో దీనిని వివరిస్తాను. ఎఫ్సీఐకి బియ్యం ఆర్థికంగా కిలోకు రూ. 42 ఖర్చు అవుతుంది. రైతుల నుంచి కొనడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, కానీ గ్రామీణ మార్కెట్లలో మీరు దానిని కిలోకు రూ. 30 తీసుకోవచ్చు.
మీరు మొదట ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆపై పంపిణీ చేయడం ఎందుకు? చత్తీస్ గఢ్ సహ ఇతర ప్రాంతాలలో రైతులు చేస్తున్నది ఏమిటంటే వారు తమ వరి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తారు. ఆపై ప్రభుత్వం దానిని తమకు తిరిగి వస్తుందని ఆశిస్తారు. ఇది అనవసర ట్రిప్పింగ్.
ఇక్కడ మంచి విధానం ఏంటంటే.. కొంత నగదు ఇవ్వడం, ఆహార కూపన్లు ఇవ్వడం, గోధుమలు, బియ్యం మాత్రమే ఎందుకు? మీరు బియ్యం ఉత్పత్తిదారునికి బియ్యం ఇస్తున్నారు.
ఇది పూర్తిగా వృథా. నేడు ఆహార భద్రత సవాల్ కాదు. ప్రజలకు పప్పు ధాన్యాలు, నూనెగింజలు, పాలు, గుడ్లు, ఎక్కువ పోషకాలు అవసరం. నగదు తో వాటిని కొననివ్వండి లేదా కూపన్లు ఇవ్వండి.
ఎవరూ అర్హులో దేశంలో నిర్వచించాలా?
ప్రపంచ బ్యాంకు ఆదాయా ఆధారిత విధానాన్ని అనుసరిస్తుంది. 2021 ధరల స్థాయిలో పీపీపీ పరంగా ప్రతి వ్యక్తికి రోజుకు మూడు డాలర్ల ఆదాయం. ప్రతి వ్యక్తి కచ్చితమైన ఆదాయం కొలవడం కష్టం.
కానీ వారు అంచనాలను ఉపయోగించి దానిని రూపొందిస్తారు. నీతి అయోగ్ బహుమితీయ పేదరికానికి 12 సూచికలు ఉపయోగిస్తుంది. దేశంలో కేవలం 11 శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు.
మీరు ప్రపంచ బ్యాంకు వద్దనుకుంటే నీతి ఆయోగ్ ను చూడండి. ఆ సూచికల ఆధారంగా అర్హుల జాబితాను తీసుకురండి. దేశంలో కేవలం 15 శాతం మందికి మాత్రమే ఉచిత ఆహారం అందించాలని చెబితే, మిగిలిన వారి నుంచి మద్దతు ధర ప్రకారం లేదా యాభై శాతం చెల్లించాలని చెప్పడం సబబుగా ఉంటుంది.
మీరు లబ్ధిదారుల ఇళ్లకు మార్కింగ్ చేయాలని సూచిస్తున్నారు? ఇది సామాజికంగా ప్రమాదకరం కాదా?
నా ఉద్దేశం ఏంటేంటే.. ఇది డబ్బు- సామర్థ్యం ఉన్న వారికి, జీవనోపాధి పొందగల వ్యక్తులకు ఉచితంగా పంపిణీ చేయమని ఎవరు అడిగారు? మీరు సోమరి ప్రజలతో కూడిన దేశాన్ని తయారు చేస్తున్నారు. ఇది ప్రమాదం.
ఎరువుల సబ్సిడీ నుంచి కూడా ఇలాగే చెప్తున్నారు? అందులో ఉన్న సమస్యలు ఏంటీ? పర్యావరణం, ఆర్థిక రంగాలకు కలిగే నష్టాలు?
ఎరువులు సబ్సిడీ, వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ బడ్జెట్ కంటే ఎక్కువ. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ నేరుగా రైతులతో మాట్లాడదు. అయితే అది ఇచ్చే సబ్సిడీ మాత్రం నేరుగా రైతులకు ఇవ్వాలి.
నేడు మనం యూరియాకు భారీ సబ్సిడీ ఇస్తున్నాము. మొక్కలు ఆ యూరియాలో 35 శాతం నుంచి 40 శాతం కంటే ఎక్కువ వినియోగించవు. మిగిలినది నైట్రస్ ఆక్సైడ్ గా మారి వాతావరణంలోకి వెళ్తుంది.
ఇది కార్బన్ డై ఆక్సైడ్ కంటే 273 రేట్ల కంటే ఎక్కువ. ఇవి వాతావరణాన్ని తీవ్ర కలుషితం చేస్తున్నాయి. అది భూమిలోకి ఇంకి నైట్రైట్ శాతం పెరుగుతుంది. ఈ భూగర్భ జలాలు తాగడానికి పనికిరావు.
థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులకు కారణం అవుతాయి. పంజాబ్ లో వీటి ఎక్కువ వినియోగం వలన క్యాన్సర్ కూడా వస్తుందని చెబుతున్నారు. ఎరువుల ధరలను నియంత్రించాలి.
ఎన్పీకే నిష్పత్తులు సరిగా పనిచేయట్లేదు. ఉత్పత్తి చేయబడిన ఎరువులలో 20 నుంచి 25 శాతం రైతులకు చేరవు. వాటిని వేరే పరిశ్రమలు ప్లైవుడ్, గాజు పరిశ్రమలు ఉపయోగిస్తున్నారు.
ఇవి వేరే దేశాలకు వెళ్తున్నాయి. ఇక్కడ మనం యూరియాకు 85 శాతం నుంచి 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాము. దీనిని సరిచేయాలి. వీటి వలన ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల నుంచి 70 వేల కోట్ల వరకూ ఉంటుంది.
యూరియా మొత్తం వ్యవస్థను వక్రీకరిస్తుందా?
మాక్రో న్యూట్రియెంట్స్ అయిన నైట్రోజన్, ఫాస్పేట్, పోటాష్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. యూరియాకు ఎక్కువ సబ్సిడీ ఉంది. జాతీయ నిష్పత్తి ప్రకారం 4:2:1 గా ఉండాలి. కానీ నేడు ఇది 10:2 గా ఉంది. పంజాబ్, హార్యానా, తెలంగాణ వంటి రాష్ట్రాలలో ఇవి 200 శాతం అధికంగా ఉంది. యూరియాను ఎక్కువగా వాడటం వల్ల పచ్చదనం వస్తుంది. కానీ పొటాష్, ఫాస్పేట్ తక్కువగా వాడుతున్నారు.
1970 లలో ఒక కిలో ఎన్పీకే 13 కిలోల ధాన్యాన్ని ఇవ్వగా, నేడు అది కేవలం 3 కేజీలకు పడిపోయింది. ఇది ఎన్పీకే లో అసమానతలకు కారణం. అలాగే మన నేలలో జింక్ లోపం కనిపిస్తుంది. గోధుమ, బియ్యంలో జింక్ లోపం కనిపిస్తుంది. ఇదంతా ఎరువుల ధరల నిర్ణయానికి సంబంధించిన తప్పుడు విధానంతో ముడిపడి ఉంది.
మీరు ఎలాంటి పరిష్కారం సూచిస్తున్నారు? ఎరువులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ చేయకూడదా?
ఒక రైతుకు నీటిపారుదల సౌకర్యం ఉంటే స్థూల పంట విస్తీర్ణం రెట్టింపు అవుతుంది. కాబట్టి రెట్టింపు ఇవ్వండి. రబీకి ముందు ఒకసారి ఖరీఫ్ ముందు ఒకసారి ఇవ్వండి.
అప్పుడు ధరల నియంత్రణ తొలగించండి. ఎన్పీకే ధర నిష్ఫత్తులు స్వయంచాలంగా బాగా అవుతాయి. ఎరువులను సక్రమంగా ఉపయోగించుకుంటామనే సందేశం ఇచ్చినట్లు అవుతుంది. పర్యావరణానికి హాని కలిగించే ఎరువుల వినియోగం తగ్గుతుంది.
చైనాలో 60 శాతం కంటే ఎక్కువ ఎరువులు వివిధ పంటలు, ప్రాంతాలకు అనుకూలీకరించిన ఎన్పీకే నిష్పత్తులు ఉపయోగిస్తున్నారు. భారత్ లో ఇది కేవలం 17 శాతం మాత్రమే.
మనకంటే తక్కువ విస్తీర్ణం కలిగిన చైనా, మనకంటే వ్యవసాయ ఉత్పత్తి కంటే రెండింతలు ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. చైనా రైతులకు హెక్టార్ కు ప్రత్యక్షంగా సబ్సిడీ ఇస్తతుంది. వారు ధరలకు సబ్సిడీ ఇవ్వరు. వారు హెక్టార్ కు రైతులకు దాదాపు 24-25 బిలియన్లను నేరుగా ఇచ్చారు. మనం కూడా అదే దారిలో వెళ్లాలి.
ఎన్ని సిఫార్సులు ఉన్నప్పటికీ భారత్ లో అది ఎందుకు అమలు కావట్లేదు?
దీనికి కొన్ని కార్యాచరణ సమస్యలు ఉన్నాయి. ఒకటి కౌలుదారులు. కౌలుదారులని ఎలా గుర్తించాలి. ప్రభుత్వం రైతులు ఎవరో తెలియదని చెబుతోంది. ఎందుకంటే అది భూమి రికార్డుల ద్వారా మాత్రమే చెబుతుంది.
భూ యజమాని కెనడా లేదా అమెరికాలో ఉండవచ్చు. భూమి సాగు చేస్తున్న వ్యక్తికి యజమాన్యం ఉండకపోవచ్చు. పీఎం కిసాన్ ప్రయోజనం కూడా భూయజమానులకు మాత్రమే వెళ్తుంది. దీని విలువ దాదాపు 63 వేల కోట్లు.
రైతులు అంటే భూ యజమాని అనే ఆలోచన నుంచి మనం బయటపడాలి. ప్రతిప్లాట్ ను మనం గుర్తించాలి. జీపీఎస్ కదులుతున్న కార్ ను గుర్తించగలదు. ఇవి స్థిర ప్లాట్లు. అంతరిక్ష సాంకేతికత ద్వారా వీటిని ఆధార్ వలే నెంబర్లు వేయవచ్చు.
దేశంలోని దాదాపు 35 శాతం భూమిని కౌలుదారులే సాగుచేస్తున్నారు. వీరికి క్రెడిట్ లభించదు. దీన్ని పరిష్కరించకుండానే సబ్సిడీలు నిజమైన రైతులకు చేరుతున్నాయంటే మనం మోసపోతున్నట్లే.
చివర్లో మీరు ఉచితాల గురించి ఒక పెద్ద రాజకీయ అంశాన్ని కూడా ప్రస్తావించారు? ఆ ఆందోళన ఏమిటీ?
ప్రతిదీ ఉచితంగా ఇవ్వబడుతోంది. వివిధ పేర్లతో ప్రతిదీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఉచితాల ద్వారా మీరు ఎప్పటికీ దేశాన్ని బలోపేతం చేయలేరు. ఉచితాలను పరిమితం చేయాలి.
మీరు బలమైన, స్వావలంబన దేశంగా మారాలంటే విద్య, మానవ వనరులు, నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెరగాలి. లేకపోతే ఈ ఉచిత సంస్కృతి దేశాన్ని చంపుతుంది. ఉచితాలతో దేశం ఎదగలేదు.
Next Story


