
ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన అర్జెంటీనా
వరుసగా మూడో సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లిన మెస్సీ సేన
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో వరసుగా మూడోసారి అర్జెంటీనా ఫైనల్ కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్ లో ట్రోఫిని ముద్దాడిన ఈ జట్టు వరుసగా రెండోసారి కప్ సాధించాలనే కలను సాకారం చేసుకోవడానికి ఒక అడుగు దూరంలో నిలిచింది.
ఆటలో ఆది నుంచి ఆధిపత్యం వహించిన ఇంగ్లాండ్ 85 నిమిషం వరకూ 1-0 తో ఆధిక్యంలో ఉంది. అయితే ఆట మరో 15 నిమిషాల్లో ముగుస్తుందనగా, ఎంజో ఫెర్నాంజెజ్, సబ్ ట్యూట్ ఆటగాడు లౌటారో మార్టినెజ్ చిరుతలా కదిలి వరుసగా రెండు గోల్స్ చేయడంతో అర్జెంటీనియన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
దీనితో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైదానంలో కుప్పకూలిపోయారు. ప్రపంచకప్ లో అర్జెంటీనా ఇప్పటికీ మూడుసార్లు ఇంగ్లాండ్ ను ఓడించింది. చివరిగా రెండు జట్లు 1998 లో తలపడ్డాయి. తమ పరాజయం పై ఇంగ్లండ్ కెప్టెప్ హ్యారీకేన్ స్పందించాడు.
తమ శక్తినంత పాదాలకు ధారపోసి తలపడ్డామని కానీ విజయం సాధించలేకపోయామని అన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన అర్జెంటీనా ఆదివారం న్యూజెర్సీలోని ఈస్ట్ రూథర్ ఫోర్డ్ లోని జరిగే ఫైనల్ మ్యాచ్ లో యూరోపియన్ ఛాంపియన్ అయిన స్పెయిన్ తో తలపడతారు.

