అసెంబ్లీ ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం.. తమిళనాడు, బెంగాల్ లో..
x
తమిళనాడు: ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళలు

అసెంబ్లీ ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం.. తమిళనాడు, బెంగాల్ లో..

హోరాహోరీ పోరు తప్పదని సంకేతాలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీకి.. బెంగాల్ అసెంబ్లీ తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 4,023 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నేడు 5.73 కోట్ల మంది పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఇందులో 3.60 కోట్ల మంది ఓటర్లు 1,452 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్ లోని ఉమ్రేత్ అసెంబ్లీ ఉప ఎన్నికకు, మహారాష్ట్రలోని బారామతి, రాహురీ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5.30 నిమిషాలకు వరకూ కొనసాగుతుంది. మే 4 ఫలితాల వెల్లడిస్తారు.

డీఎంకేతో ఎన్డీఏ హోరాహోరీ..

తమిళనాడులో పోరు ఆసక్తికరంగా ఉంది. డీఎంకే కూటమితో ఎన్డీఏ హోరాహోరీగా తలపడుతోంది. డీఎంకే కూటమిలో ఎస్పీఏ, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏల మధ్య సాగుతోంది. డీఎంకే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండోసారి అధికారం చేపట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదేళ్ల ప్రతిపక్షం నుంచి తిరిగి అధికారం దక్కించుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఉవ్విళ్లురుతున్నాడు. అయితే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే కూడా పోటీలో ఉండటంతో ఆయన చీల్చబోయే ఓట్లు డిసైడింగ్ ప్యాక్టర్ గా ఉండబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
‘‘రాష్ట్రంలో 5.73 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2.93 కోట్లు, 2.83 కోట్ల మంది పురుషులు ఉన్నారు. 7,728 మంది తృతీయ జెండర్ వ్యక్తులు ఉన్నారు’’ అని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు.
ఇందులో తొలిసారి ఓటు వేసేవారు 14,59,039 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. ఇందుకోసం కమిషన్ 1,06,418 బ్యాలెట్ యూనిట్లతో పాటు 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేసింది. ఎన్నికల భద్రత కోసం 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను మోహరించింది.

పశ్చిమ బెంగాల్..

పశ్చిమ బెంగాల్, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్ లో ఉన్న 16 జిల్లాలో ఉన్న 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ‘సర్’ తో ఓటర్ల సంఖ్య 12 శాతం తగ్గింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. తొలి దశలో 3.60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1.75 మంది మహిళలు పేర్కొన్నారు. ఎన్నికల కోసం మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్ పూర్, కూచ్ బెహార్, బీర్భూమ్, పూర్భ బర్ధమాన్ వంటి జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
NO MORE UPDATES
Read More
Next Story