అసెంబ్లీ ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం.. తమిళనాడు, బెంగాల్ లో..
x
తమిళనాడు: ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళలు

అసెంబ్లీ ఎన్నికల ప్రత్యక్ష ప్రసారం.. తమిళనాడు, బెంగాల్ లో..

హోరాహోరీ పోరు తప్పదని సంకేతాలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీకి.. బెంగాల్ అసెంబ్లీ తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 4,023 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నేడు 5.73 కోట్ల మంది పైగా ఓటర్లు నిర్ణయించనున్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఇందులో 3.60 కోట్ల మంది ఓటర్లు 1,452 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్ లోని ఉమ్రేత్ అసెంబ్లీ ఉప ఎన్నికకు, మహారాష్ట్రలోని బారామతి, రాహురీ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5.30 నిమిషాలకు వరకూ కొనసాగుతుంది. మే 4 ఫలితాల వెల్లడిస్తారు.

డీఎంకేతో ఎన్డీఏ హోరాహోరీ..

తమిళనాడులో పోరు ఆసక్తికరంగా ఉంది. డీఎంకే కూటమితో ఎన్డీఏ హోరాహోరీగా తలపడుతోంది. డీఎంకే కూటమిలో ఎస్పీఏ, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏల మధ్య సాగుతోంది. డీఎంకే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండోసారి అధికారం చేపట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదేళ్ల ప్రతిపక్షం నుంచి తిరిగి అధికారం దక్కించుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఉవ్విళ్లురుతున్నాడు. అయితే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే కూడా పోటీలో ఉండటంతో ఆయన చీల్చబోయే ఓట్లు డిసైడింగ్ ప్యాక్టర్ గా ఉండబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
‘‘రాష్ట్రంలో 5.73 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2.93 కోట్లు, 2.83 కోట్ల మంది పురుషులు ఉన్నారు. 7,728 మంది తృతీయ జెండర్ వ్యక్తులు ఉన్నారు’’ అని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు.
ఇందులో తొలిసారి ఓటు వేసేవారు 14,59,039 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. ఇందుకోసం కమిషన్ 1,06,418 బ్యాలెట్ యూనిట్లతో పాటు 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేసింది. ఎన్నికల భద్రత కోసం 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసులను మోహరించింది.

పశ్చిమ బెంగాల్..

పశ్చిమ బెంగాల్, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్ లో ఉన్న 16 జిల్లాలో ఉన్న 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ‘సర్’ తో ఓటర్ల సంఖ్య 12 శాతం తగ్గింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. తొలి దశలో 3.60 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1.75 మంది మహిళలు పేర్కొన్నారు. ఎన్నికల కోసం మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్ పూర్, కూచ్ బెహార్, బీర్భూమ్, పూర్భ బర్ధమాన్ వంటి జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

Live Updates

  • 23 April 2026 3:41 PM IST

    బూత్‌కు వెళ్తుండగా ఓటరు మృతి

     పశ్చిమ బెంగాల్  బీర్భూమ్‌లోని సూరిలో ఓటు వేయడానికి వెళ్తున్న ఒక వృద్ధ ఓటరు మరణించారు. 10వ వార్డులోని దంగల్‌పారా నివాసి అయిన అసిమ్ రాయ్, పోలింగ్ బూత్‌కు వెళ్లే మార్గంలో తీవ్రమైన ఎండ కారణంగా అస్వస్థతకు గురై మృతి చెందినట్ల సమాచారం.

  • 23 April 2026 3:40 PM IST

    బెంగాల్ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 62 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మరొక వైపు, కుమార్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థిపై దాడి కేసులో 5 మంది అరెస్టు చేశారు. దక్షిణ దినాజ్‌పూర్‌లోని కుమార్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై దాడి ఆరోపణల నేపథ్యంలో ఈ ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను ఎన్నికల సంఘం ధృవీకరించింది.  ఈ కేసుకు సంబంధించి గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

  • 23 April 2026 3:35 PM IST

    తమిళనాడు పోలింగ్:  మధ్యాహ్నం 1 గంట సమయానికి చాలా జిల్లాల్లో 55% నుంచి 60% మధ్య ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ శాతంలో తిరుప్పూర్ (62.97%), నామక్కల్ (62.51%), మరియు సేలం (61.42%) అగ్రస్థానంలో ఉన్న జిల్లాలలో ఉన్నాయి.

    చెన్నై – 54.58%

    కోయంబత్తూరు – 58.24%

    మదురై – 54.75%

    తిరుచి– 57.66%

    అరియలూర్ – 55.18%

    చెంగల్పట్టు – 56.28%

    కడలూరు – 55.13%

    ధర్మపురి – 59.02%

    దిండిగల్ – 59.79%

    కోత – 61.79%

    కల్లకురిచి – 57.15%

    కాంచీపురం – 58.98%

    కన్నియాకుమారి – 50.35%

    కరూర్ – 60.77%

    కృష్ణగిరి – 56.21%

    మయిలదుతురై – 53.59%

    నాగపట్టినం – 57.07%

    నమక్కల్ – 62.51%

    పెరంబలూరు – 57.55%

    పుదుక్కోట్టై – 56.78%

    రామనాథపురం – 51.54%

    రాణిపేట్ – 58.62%

    సేలం – 61.42%

    శివగంగై – 53.50%

    టెంకాసి – 54.24%

    తంజావూరు – 54.83%

    నీలగిరి – 50.42%

    అప్పుడు – 55.63%

    తిరువళ్లూరు – 55.45%

    తిరువారూర్ – 56%

    తూత్తుకుడి – 52.55%

    తిరునెల్వేలి – 50.73%

    తిరుపత్తూరు – 57.42%

    తిరుప్పూర్ – 62.97%

    తిరువన్నామలై – 58.23%

    వెల్లూరు – 57.49%

    విల్లుపురం – 58.23%

    విరుదునగర్ – 57.27%

  • 23 April 2026 11:56 AM IST

    తిరునల్వేలిలో ఎన్నికల బహిష్కరణ

    తిరునెల్వేలి జిల్లాలోని నంగునేరి పెరుంపతు గ్రామంలోని 290వ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించినట్లు సమాచారం.

    పోలింగ్ ప్రారంభమై నాలుగు గంటలు గడిచినా, నమోదైన 969 మంది ఓటర్లలో ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాకపోవడంతో బూత్ నిర్మానుష్యంగా మారిందని మీడియా కథనం

  • 23 April 2026 11:55 AM IST

    ఓటేసిన అర్జున్ 

    నటుడు అర్జున్ తన భార్య నివేదితతో కలిసి చెన్నై ఆల్వార్‌పేట్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పాఠశాలలో ఓటు వేశారు.

  • 23 April 2026 11:53 AM IST

    ఫిర్యాదుల వెల్లువ

    బెంగాల్ ఓటింగ్ సందర్బంగా ఉదయం 11 గంటల లోపు ఎన్నికల సంఘానికి 600కు పైగా ఫిర్యాదులు అందాయిఉదయం 11 గంటల సమయానికి, ఎన్నికల సంఘం కార్యాలయానికి మొత్తం 260 ఫిర్యాదులు అందాయి. అదనంగా, cVIGIL యాప్ ద్వారా మరో 375 ఫిర్యాదులు నమోదయ్యాయి

  • 23 April 2026 11:51 AM IST

    బెంగాల్‌ ఎన్నికలుఫ 

    ఉదయం 11 గంటల వరకు 41 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.

  • 23 April 2026 11:50 AM IST

    తమిళనాడు పోలింగ్ : పోలింగ్‌లో చెన్నై, మదురై 17.25%తో ముందంజలో ఉండగా, వాటి తర్వాతి స్థానాల్లో ఉన్నవి:

    తిరువళ్లూరు – 17.22%

    కన్యాకుమారి – 17.08%

    తంజావూరు – 17.05%

  • 23 April 2026 11:49 AM IST

    తమిళనాడు శాసనసభ ఎన్నికలు: ఉదయం 11 గంటల సమయానికి 37.56% పోలింగ్ నమోదైంది. 

  • 23 April 2026 11:45 AM IST

    తమిళనాడు పోలింగ్ ...

    చెన్నైలో సినీ అగ్రతారలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, ప్రభుదేవా, శివకార్తికేయన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటి శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత, తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తిరుచిరాపల్లి తూర్పు, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రముఖ నటుడు శివకార్తికేయన్  కూడా భార్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు. 

Read More
Next Story