LIVE తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ
x

తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ

జననాయకుడిగా మారిన విజయ్


Click the Play button to hear this message in audio format

దేశంలో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.

విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..

దేశంలో అత్యంత కీలకమైన తమిళనాడు ఎన్నికలలో తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తుందా? మెజారిటీ ఎంత సాధిస్తారు? విజయ్ కింగ్ మేకర్ అవుతాడా? హంగ్ వస్తుందా? ఇవే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి.
సంక్షేమ పథకాలు, ద్రవిడవాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని స్టాలిన్ నమ్ముతున్నారు. అయితే పార్టీ ఎప్పుడూ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే వైపే నిలిచాయి.
సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీగా ఓట్లు చీలుస్తుందని అంచనాలు ఉన్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒంటరిగా బరిలోకి దిగింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే 30 శాతం ఓట్లు, 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది మొత్తం ఎన్నికల కథనాన్ని తలకిందులు చేసింది. ఇదే నిజమైతే భారత ఎన్నికల చరిత్రలో ఇదో సంచలనం అవుతుంది.

పుదుచ్చేరిలో..

30 స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బలంగా ఉండటంతో పోరు హోరాహోరీగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న అంశాలు కూడా వేగంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

కేరళ..

కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండుసార్లు పీఠంపై ఉన్నారు. ఇప్పడు ఆయన హ్యట్రిక్ విజయంపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 99 స్థానాలు సాధించి అధికారం చేపట్టారు. కానీ తరువాత అన్ని ప్రతికూల అంశాలు ఎల్డీఎఫ్ ను చుట్టుముట్టాయి. అవినీతి,కుంభకోణాలు వెలుగుచూడటంతో యూడీఎఫ్ బలం ఫుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ వామపక్షాలు ఓటమి పాలైతే దేశంలో ఉన్న చివరి అధికారకోట కూడా కోల్పోయినట్లు అవుతుంది.

పశ్చిమ బెంగాల్ లో..

ఉత్తరాదిన ఉన్న పశ్చిమ బెంగాల్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 148. ఇక్కడ 2011 నుంచి టీఎంసీ అధికారంలో ఉంది. గత 15 ఏళ్లు పాలనలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. దీనితో బీజేపీ బలంగా పోరాడింది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని మమతా బెనర్జీ వైపు, ఇంకొన్ని బీజేపీ వైపు నిలిచాయి. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మరో పెద్ద రాష్ట్రం దాని సొంతమవుతుంది.
ఈసారి బెంగాల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి ఘర్షణలు, కర్ప్యూలు లేవు. పార్టీ కార్యాలయాలకు నిప్పులు పెట్టడం లాంటివి జరగలేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ వల్ల 27 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీనిపై టీఎంసీ వీధి పోరాటాలతో పాటు న్యాయ స్థానాలను ఆశ్రయించింది.

అస్సాం..

అస్సాంలో 126 స్థానాలు ఉన్నాయి. బీజేపీ మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగింది. ఇక్కడ మరోసారి ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదే జరిగితే వరుసగా మూడో సారి బీజేపీ అధికారం దక్కించుకున్నట్లు అవుతుంది.


Live Updates

  • 4 May 2026 10:31 AM IST

    మహా బైపోల్స్: పవార్, కర్దిలే లీడ్

    మహారాష్ట్ర బైఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా బారామతిలో సునేత్రా పవార్ భారీ ఆధిక్యం సాధించారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఆమెకు 26,773 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఇంకా 100 ఓట్ల మార్క్ కూడా దాటలేదు.

    పుణే జిల్లాలోని బారామతి నియోజకవర్గంలో 58.27% పోలింగ్ నమోదైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంతో ఈ బైఎన్నిక జరిగింది.

    ఇక రాహురిలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ కర్దిలే, ఎన్‌సీపీ (ఎస్‌పి) అభ్యర్థి గోవింద్ మోకటేపై 21,000కిపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నిక బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కర్దిలే మృతి కారణంగా నిర్వహించబడింది.

  • 4 May 2026 10:30 AM IST

    టీవీకే అధినేత విజయ్ ఇంటి వద్ద భాారీ భద్రత

    తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తళపతి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అధికారిక ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ ౬౮ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  మరికొన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్న వేళ ఆయన నివాసం దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రత కల్పిస్తున్నారు.

  • 4 May 2026 10:19 AM IST

    బాగల్‌కోటలో కాంగ్రెస్ లీడ్, దావణగెరె సౌత్‌లో బీజేపీ ముందంజ

    కర్ణాటక అసెంబ్లీ బైఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది. బాగల్‌కోటలో అధికార కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, దావణగెరె సౌత్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికల సంఘం ప్రకారం, బాగల్‌కోటలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ మెటి, బీజేపీకి చెందిన వీరభద్రయ్య చరణ్తిమఠ్‌పై 5,016 ఓట్లతో ముందంజలో ఉన్నారు. దావణగెరె సౌత్‌లో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ దసకరియప్ప, కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ మల్లికార్జున్‌పై 577 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ బైఎన్నికలు సీనియర్ కాంగ్రెస్ నేతలు హెచ్.వై. మెటి, శమనూరు శివశంకరప్ప మృతి నేపథ్యంలో నిర్వహించబడ్డాయి. ఫలితాలు తక్షణ రాజకీయ సమీకరణాలను మార్చకపోయినా, కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • 4 May 2026 10:13 AM IST

    తమిళనాడు:

    TVK – 84

    AIADMK+ – 72

    DMK+ – 55

    పశ్చిమ బెంగాల్:

    BJP+ – 168

    TMC+ – 112

    కేరళ:

    UDF – 76

    LDF – 47

    BJP+ – 4

    అస్సాం:

    BJP+ – 92

    Congress – 26

    AIUDF+ – 1

    పుదుచ్చేరి:

    NRC+ – 16

    TVK+ – 4

  • 4 May 2026 9:56 AM IST

    కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు వెనుకంజ

    కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో తొలి ధోరణులు ఆసక్తికరంగా మారాయి. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతుండగా, అధికార కూటమికి చెందిన పలువురు మంత్రులు తమ నియోజకవర్గాల్లో వెనుకబడినట్లు సమాచారం. వీణా జార్జ్, ఎం.బి. రాజేష్, ఓ.ఆర్. కేలు, ఆర్. బిందు, జె. చించురాణి, పి. రాజీవ్, కె.బి. గణేశ్ కుమార్, రోషి ఆగస్టిన్ వంటి మంత్రులు ప్రారంభ రౌండ్లలో వెనుకంజలో ఉన్నట్లు టెలివిజన్ నివేదికలు తెలిపాయి.  ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దాదాపు 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ సుమారు 50 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సుమారు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తొలి ధోరణులు సూచిస్తున్నాయి.

  • 4 May 2026 9:46 AM IST

    తమిళనాడు: డీఎంకేను బీట్ చేసిన టీవీకే..

    టీవీకే- 67
    డీఎంకే- 58
    అన్నాడీఎంకే- 56
    బెంగాల్ లో కమలం రెపరెపలు..
    బీజేపీ- 159
    టీఎంసీ- 119
    కేరళ
    యూడీఎఫ్- 65
    ఎల్డీఎఫ్- 34
    బీజేపీ- 4
    అస్సాం
    బీజేపీ ప్లస్- 84
    కాంగ్రెస్- 23
    ఏఐయూడీఎఫ్- 2
    పుదుచ్చేరి
    ఎన్ ఆర్ సీ ప్లస్- 13
    టీవీకే- 4


  • 4 May 2026 9:41 AM IST

    పెరంబూర్ లో విజయ్ కు ఆధిక్యం..

    టీవీకే చీఫ్ పోటీ చేస్తున్నపెరంబూర్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే తిరుచ్చి ఈస్ట్ లోనూ ఇదే ఫలితం కనిపిస్తోంది. ఆయన ఈ రెండు స్థానాలలో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలు ఇంతకుముందు డీఎంకే చేతిలో ఉన్నాయి. చెన్నైని ఆనుకుని ఉన్న పెరంబూర్ లో 2.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
    ఇక్కడ ద్రవిడియన్ పాలిటిక్స్ దే మొదటి నుంచి ఆధిపత్యం. డీఎంకే కు బలమైన పట్టు ఉంది. అయినప్పటికీ విజయ్ ముందంజలో ఉండటంతో ఆ పార్టీ వర్గాలు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాయి. 2021 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే అభ్యర్థి ఆర్ డీ శేఖర్ ఇక్కడ 52.53 శాతం ఓట్లు సాధించి విజయం సొంతం చేసుకున్నారు.

  • 4 May 2026 9:35 AM IST

    తమిళనాడులో అన్నాడీఎంకే చాప్టర్ క్లోజ్?

    తమిళనాడు ఎన్నికలలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో విజయ్ పార్టీ అన్నాడీఎంకేను మించిపోయి స్పష్టమైన ఆధిక్యం కనపరిచింది. అయితే డీఎంకే కూటమికే ఈ ఎన్నికలలో స్పష్టమైన ముందంజ వేసింది.

  • 4 May 2026 9:25 AM IST

    భవానీపూర్ లో మమతపై సువేందు అధికారి ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో సీఎం మమతా బెనర్జీ వెనకంజ వేశారు. ఆమె కోల్ కతలోని భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా బరిలో ఉన్నారు. అయితే పోస్టల్ ఓట్లలో సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్ లో కూడా ముందంజలో ఉన్నట్లు తేలింది


  • 4 May 2026 9:21 AM IST

    బెంగాల్ లో వంద సీట్లలో బీజేపీ లీడింగ్

    బీజేపీ-109

    టీఎంసీ- 89

    తమిళనాడులో ఫుంజుకున్న టీవీకే

    డీఎంకే- 59

    అన్నాడీఎంకే- 27

    టీవీకే- 27

    కేరళ

    యూడీఎఫ్- 39

    ఎల్డీఎఫ్- 20

    బీజేపీ- 5

    అస్సాం

    బీజేపీ- 60

    కాంగ్రెస్- 18

    ఏఐయూడీఎఫ్- 1

    పుదుచ్చేరి

    ఎన్ఆర్సీ- 10

    టీవీకే ప్లస్- 5

Read More
Next Story